Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసి ఆపై మాత్రలు ఇచ్చి.. మైనర్‌పై యువకుల దారుణం!

Written By ఠాగూర్
Updated: సోమవారం, 7 డిశెంబరు 2020 (16:12 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో చిన్నారి కామాంధుల చేతిలో బలైంది. యువతులు, మహిళలను రక్షించేందుకు ఎన్నో రకాలై కఠిన చట్టాలు చేస్తున్నప్పటికీ వాటివల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఫలితంగా అనేక ప్రాంతాల్లో నేరాలు ఘోరాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ యువతి గర్భందాల్చడంతో గర్భస్రావం చేసేందుకు మాత్రలు మింగించారు. కానీ, అవి వికటించి ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వరంగల్ జిల్లా గ్రామీణ జిల్లాకు చెందిన దుగ్గోండి మండలం, రేపల్లెకు చెందిన ఓ మైనర్ బాలికను ఇద్దరు యువకులు లొంగదీసుకుని అత్యాచారం జరిపారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు గర్భస్రావం అయ్యేందుకు ఆ బాలికకు మాత్రలు ఇచ్చారు. 
 
ఈ మాత్రలను మింగిన తర్వాత ఆ బాలికకు అధిక రక్తస్రావం కావడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. కానీ, ఆ యువతి చికిత్స పొందుతూ కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. 

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments