మత్తు ఇంజెక్షన్ వేసుకుని స్టాఫ్‌నర్స్ ఆత్మహత్య.. ఎక్కడ?

గురువారం, 13 ఆగస్టు 2020 (09:06 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగేళ్లుగా పని చేస్తున్న ఓ స్టాఫ్ నర్సు బలవన్మరణానికి పాల్పడింది. తాను పని చేసే ఆస్పత్రి నుంచి తన వెంట తెచ్చుకున్న మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం కమ్మగడ్డ గ్రామానికి చెందిన సౌందర్య (25) సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తూ ఆస్పత్రి హాస్టల్‌లోనే నివసిస్తోంది. 
 
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని హాస్టల్‌కు వచ్చిన సౌందర్య రాత్రయినా బయటకు రాకపోవడంతో స్నేహితులు అనుమానించారు. దీంతో గదిలోకి చూడగా విగతజీవిగా కనిపించింది. 
 
ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి గదిని పరిశీలించారు. ఆమె పక్కన మత్తు ఇంజక్షన్ పడి ఉండడంతో అది తీసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments