suvichar

మత్తు ఇంజెక్షన్ వేసుకుని స్టాఫ్‌నర్స్ ఆత్మహత్య.. ఎక్కడ?

Written By ఠాగూర్
Updated: గురువారం, 13 ఆగస్టు 2020 (09:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగేళ్లుగా పని చేస్తున్న ఓ స్టాఫ్ నర్సు బలవన్మరణానికి పాల్పడింది. తాను పని చేసే ఆస్పత్రి నుంచి తన వెంట తెచ్చుకున్న మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం కమ్మగడ్డ గ్రామానికి చెందిన సౌందర్య (25) సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తూ ఆస్పత్రి హాస్టల్‌లోనే నివసిస్తోంది. 
 
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని హాస్టల్‌కు వచ్చిన సౌందర్య రాత్రయినా బయటకు రాకపోవడంతో స్నేహితులు అనుమానించారు. దీంతో గదిలోకి చూడగా విగతజీవిగా కనిపించింది. 
 
ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి గదిని పరిశీలించారు. ఆమె పక్కన మత్తు ఇంజక్షన్ పడి ఉండడంతో అది తీసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments