శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (21:48 IST)

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై తెలంగాణ సర్కార్ సీరియస్

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం... ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కు కూడా అనుమతి ఇవ్వడం తెలిసిందే. అయితే... ఎప్పుడైతే ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అనుమతి ఇచ్చిందో.. అప్పుడు ఇదే అదను అనుకుని మానవత్వం మరచి కొన్ని హాస్పటల్స్ కరోనా పేషంట్స్ నుంచి లక్షలకు లక్షలు వసూలూ చేస్తూ దోపిడి చేస్తుంది.
 
కష్టకాలంలో మానవత్వంతో ఆలోచించకుండా... ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
 
విజిలెన్స్ ఎంక్వైరీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై అధికారులతో మంత్రి ఈటెల చర్చించారు. త్వరలోనే విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
 
తప్పు చేసినట్లు తేలితే హాస్పిటల్‌ లైసెన్స్‌ రద్దు చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల లైసెన్స్‌ రద్దు చేసారు. ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్స్ పైన 800కు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం.