దక్షిణ మధ్య రైల్వే ఉద్యానవన శాఖకు అవార్డుల పంట పడింది. వివిధ కేటగిరీల్లో ఏకంగా 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ అవార్డులను ఏడీజీ సింగయ్య అందుకున్నారు. గోల్డ్ గార్డెన్ సర్టిఫికేట్ను కూడా ఆయన స్వీకరించారు. ఈ అవార్డులను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రధానం చేశారు. దక్షిణ మధ్య రైల్వే ఉద్యానవనాల విభాగం ఒకేసారి ఇన్ని అవార్డులు అందుకోవడంతో ఏడీజీ సింగయ్య పట్టరాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.