ఫిబ్రవరి 2 నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

బుధవారం, 22 జనవరి 2020 (08:20 IST)
అతిపెద్ద గిరిజన పండగ సమ్మక్క-సారలమ్మ జాతర. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యాలను కల్పించింది.

ముఖ్యంగా రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు 500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 8 వరకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్, దిల్‌ సుఖ్‌నగర్ బస్‌స్టేషన్, జగద్గిరిగుట్ట, నేరేడ్‌మెట్, కెపిహెచ్‌బి, మియాపూర్, లింగంపల్లి, లాల్ దర్వాజ ప్రాంతాలనుంచి బయలుదేరి, ఉప్పల్‌లోని వరంగల్ పాయింట్ మీదుగా బస్సులు నడుపుతున్నారు.

మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు వివరాలను TS RTC అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు ప్రయాణికులు జాతరకు వెళ్లేందుకు అడ్వాన్స్ రిజర్వేషన్ (www.tsrtconline.in) సౌకర్యం కల్పించారు.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా పెంచనున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉండటంతో.. ప్రత్యేక బస్సులు ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments