1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (11:25 IST)

ఉస్మానియా క్యాంపస్‌లో సమాధి...

దేశంలోని ఎంతో పేరున్న విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకటి. ఈ వర్శిటీ ప్రాంగణంలో ఒక సమాధి బయటపడింది. ఇది విద్యాలయంలో తీవ్ర కలకలం రేపింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆదివారం సాయంత్రం కాలేజీ హాస్టల్ వనుక స్థలానికి కొందరు విద్యార్థులు వెళ్ళారు. అపుడువారి కంటికి ఒక సమాధి కనిపించింది. దీన్ని చూడగానే వారు భయపడి తమ గదులకు పరుగులు తీశారు. 
 
ఆ తర్వాత హాస్టల్ వెనుక భాగంలో సమాధి ఉన్న విషయాన్ని సహచర విద్యార్థులకు చెప్పారు. చివరకు ఈ విషయం హాస్టల్ చీఫ్ వార్డెన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
అయితే, ఈ సమాధిలో మనిషి పూడ్చిపెట్టారా? లేకా ఏదేని జంతువును పాతిపెట్టారా? అనే విషయంలో ఆరా తీస్తున్నారు. అయితే, హాస్టల్ క్యాంపస్‌లో సమాధి కనిపించడంతో విద్యార్థులు మాత్రం భయానికి లోనయ్యారు.