1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 7 డిశెంబరు 2016 (17:47 IST)

జయలలిత అంత్యక్రియలు చూశాక నాకు అలా అనిపిస్తోంది... మంత్రి హరీశ్ రావు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. అంత్యక్రియలకు హాజరైన తర్వాత తనకు ఎన్నో విషయాలు బోధపడినట్లు హరీశ్ చెప్పారు. బుధవారం నాడు హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. అంత్యక్రియలకు హాజరైన తర్వాత తనకు ఎన్నో విషయాలు బోధపడినట్లు హరీశ్ చెప్పారు. బుధవారం నాడు హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 
 
ఆయన మాటల్లోనే... " ఈ అందమైన శరీరం భూమి పాలు లేదా అగ్నిపాలు. ప్రాణం యముడి పాలు. పాపం చేస్తే యముని వద్దకు, పుణ్యం చేస్తే స్వర్గానికి. మనం ఎన్నో తప్పులు చేస్తున్నం కాబట్టి ఖచ్చితంగా యముని వద్దకే వెళ్తం. మనం ఎంతో శ్రమపడి సంపాదించిన ఆస్తి మనతో రాదు. ఇది నిన్న జయలలిత అంత్యక్రియలకు వెళ్లాక నాకు తెల్సింది" అని చెప్పారు