1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మే 2022 (16:34 IST)

కేవీపీ ఇంట్లో దొంగలు పడ్డారు.. డైమండ్ నెక్లెస్ మాయం

KVP
KVP
కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో దొంగలు పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా దాదాపు రూ. 46 లక్షలు విలువ గల 49 గ్రాముల డైమండ్ నెక్లెస్ మాయమైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
డైమండ్ నెక్లెస్ మాయంపై కేవీపీ భార్య సునీత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 11న సునీత తెలుపు రంగు డైమండ్ నెక్లెస్ ధరించి ఓ ఫంక్షన్‌కు వెళ్ళారు. ఫంక్షన్ నుండి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం బెడ్ రూమ్‌లో నెక్లెస్‌ను పెట్టగా... కొద్దిసేపటికే నెక్లెస్ మాయమవడంతో సునీత ఇళ్లంతా వెతికారు. 
 
డైమండ్ నెక్లెస్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పని మనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ రెండు రోజుల క్రితం కేవీపీ భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.