1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (19:49 IST)

టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓట‌మితో కుంగిపోదు: మంత్రి హరీశ్ రావు

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ ఫ‌లితంపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తామన్నారు. ఎన్నిక‌ల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓట‌ర్లకు, కార్య‌క‌ర్త‌ల‌కు ధన్య‌వాదాలు తెలిపారు.

''హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తాం.  ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓట‌ర్లంద‌రికీ పేరుపేరున క్ర‌త‌జ్ఙ‌త‌లు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ కార్య‌క‌ర్త‌ల‌కు ద‌న్య‌వాదాలు.  టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ త‌గ్గ‌లేదు. 

అయితే, దేశంలో ఎక్క‌డ‌లేనివిధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీలు క‌ల్సిప‌నిచేశాయి. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు కూడా చెప్తున్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మ‌క్కు కావ‌డాన్ని రాష్ట్ర ప్ర‌జలంతా గ‌మ‌నిస్తున్నారు. 

ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓట‌మితో కుంగిపోదు.. గెలిచిన‌నాడు పొంగిపోలేదు. ఓడినా.. గెలిచిన టీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండి ప‌నిచేస్తుంది''  అని హరీశ్ చెప్పారు.