సునీల్ ఇన్ దిల్రాజు మూవీ: త్వరలో సెట్స్పైకి..!
వాసు వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కనుంది. దిల్రాజు నిర్మించనున్న ఈ సినిమా నవంబర్లో సెట్స్పైకి వెళ్లనుందని సమాచారం.
కోనవెంకట్- గోపిమోహన్లు ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ను రెడీ చేశారని, దీంతో వచ్చే నెల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
ఇదే విషయాన్ని కోనవెంకట్ కూడా సోషల్ మీడియాలో ఖరారు చేశారు. కాగా సునీల్ హీరోగా 'భీమవరం బుల్లోడు' విడుదలై దాదాపు తొమ్మిది నెలలైన సంగతి తెలిసిందే.
అంతకుముందు పూలరంగడు, మిస్టర్ పెళ్లికొడుకు, తడాఖా సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. రాజమౌళి డైరక్షన్లో తెరకెక్కిన మర్యాద రామన్న సునీల్ కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచిన సంగతి తెలిసిందే.