ఇండస్ట్రీలో నిజమైన నిర్మాతలు లేరు... చచ్చిపోయారు : మోహన్ బాబు వ్యాఖ్య
సినిమా ఇండస్ట్రీ ఎవడబ్బా సొమ్ముకాదు. అందరూ కలిసుంటేనే చక్కగా వుండగలం. గుట్టు, గోప్యం అందరికీ వుంటుంది. వీలైతే సాయం చేసి కలిసికట్టుగా వుందామని... మోహన్ బాబు అన్నారు. ఇటీవలే ఆయన కుమార్తె మంచు లక్ష్మీ విడుదల చేసిన 'దొంగాట' సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఆయన ఈవిధంగా స్పందించారు.
ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు మీడియాపై పెట్టిన ఆంక్షలకు ఓ ఛానల్ ప్రతినిధి అడిగితే.. పైవిధంగా స్పందించారు. ఇంకా మాట్లాడుతూ... ప్రస్తుతం ఇండస్ట్రీలో నిజమైన నిర్మాతలు లేరు. చనిపోయారు. మంచి దర్శకులు కూడా వేళ్ళపై లెక్కించవచ్చు. ఇప్పుడున్న నిర్మాతలు ఫైనాన్షియర్ల దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసేరకం అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇక లక్ష్మీగురించి మాట్లాడుతూ.. మొదట ఇండస్ట్రీలోకి వద్దన్నాను. కానీ విష్ణు ప్రోత్సాహంతో టీవీ షోలు చేసి పేరు తెచ్చుకుంది. ఆమెకొక బ్రాండ్ ఏర్పర్చుకుంది. ఇప్పుడు మంచి పేరు తెచ్చిపెట్టింది అన్నారు. లక్ష్మీ మాట్లాడుతూ... ఆరంభంలోనే సినిమాపై నమ్మకముంది. అదే నిజమయిందని విజయం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసింది.