ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ సినిమా షూటింగ్కు బ్రేక్!
ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ల చిత్రం ఏ ముహూర్తంలో ప్రారంభించారో రెండుసార్లు షూటింగ్ వాయిదాపడింది. సినిమా ప్రారంభంలోనే 'రభస' సినిమా విడుదల కావడం, అది హిట్ టాక్ రాకపోవడంతో.. కలత చెందిన ఎన్టిఆర్ కొద్దిరోజులు షూటింగ్కు విరామం తీసుకున్నారు. ఆ తర్వాత షెడ్యూల్లో హీరోయిన్ విషయంలో చిన్నపాటి రభస జరిగి, మళ్ళీ వాయిదాపడినట్లు తెలిసింది.
ముచ్చట మూడోసారి.. వైజాగ్ నుంచి గోవా షెడ్యూల్ జరగాల్సివుంది. అన్ని ఏర్పాటు చేశాక... ఇండస్ట్రీలో కార్మికుల సమస్యలు ఆ సినిమాపై పడ్డాయి. కార్మికులకు వేతనాలు పెంచాలని రెండేళ్ళుగా చేస్తున్న దీక్షు ఈరోజు మరింత ముదిరాయి. దాసరి ఆధ్వర్యంలో చర్చలు జరిపి ఇండస్ట్రీని గాడినపెట్టాని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పూరీ, ఎన్టిఆర్ సినిమా గురించి క్రేజ్ వుంది. బండ్ల గణేష్ సినిమా నిర్మిస్తున్న ఈ చిత్రం భారీగా నిర్మిస్తున్నాడు.