శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2023 (13:51 IST)

ద్వేషించేవారిని నిరాశపరుస్తూనే ఉంటా : అనసూయ

anasuya
ద్వేషించేవారిని నిరంతరం నిరాశపరుస్తూనే ఉంటానని హీరోయిన్, బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ అన్నారు. ఇదే విషయంపై ఆమె తాజాగా పెట్టిన ఓ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. హేటర్స్ (ద్వేషించేవారు)ని ఉద్దేశించి ఆమె ఈ ట్వీట్ చేశారు. ద్వేషాన్ని ఎదుర్కొని తాను ధైర్యంగా ముందుకు సాగుతానని అన్నారు. 
 
'మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. ఎదుటి వ్యక్తులను తక్కువ చేసి.. వాళ్లు బాధపడుతుంటే సానుభూతి చూపించి.. మీకు మీరు మంచి వ్యక్తులనే భావన పొందుతారు. ఆ బాధపడిన వ్యక్తే స్ట్రాంగ్‌గా నిలబడితే మాత్రం తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తారు. ఇదే కదా కపటధోరణి అంటే. ఈరోజు నేను మాటిస్తున్నా. ఎంతోమందికి ఉదాహరణగా ఉండేలా నేను జీవితంలో ముందుకెళ్తా. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా ఎలా ముందుకు సాగాలో చూపిస్తా. ఎందుకంటే, నువ్వు ఒక స్థాయికి వెళ్లేవరకూ వాళ్లు నిన్ను కిందకు లాగాలనే చూస్తుంటారు. నువ్వు చనిపోయాక సానుభూతి చూపించి అటెన్షన్‌ పొందాలనుకుంటారు. బతికినంతకాలం చావాలనిపించేలా ట్రీట్‌ చేసి.. చచ్చాక ఉద్ధరించాలనుకుంటారు.
 
ఏది ఏమైనా ఇంతకముందు నేను విపరీతమైన ద్వేషాన్ని ఎదుర్కొని నిలబడ్డా. ఇక ముందూ నిలబడతా. హేటర్స్‌ను ఎప్పుడూ నిరాశపరుస్తూనే ఉంటా. నన్ను అభిమానించే వాళ్లందరినీ ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటా. మీరు నా బలం. శక్తి' అని ఆమె ట్వీట్‌ చేశారు. అనంతరం మరో ట్వీట్‌లో.. 'ఐ యామ్‌ సారీ.. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మనం ఉండటానికి అసలు కారణం ఏమిటి? అటెన్షన్‌ పొందడం కోసం కాదా?' అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.