శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 10 మార్చి 2019 (09:06 IST)

అవసరాలతో అనుష్క... ఎన్నారై మహిళగా

'బాహుబలి' చిత్రం తర్వాత అనుష్క శెట్టి ఎట్టకేలకు మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించింది. బాహుబలి తర్వాత ఆమె నటించనున్న చిత్రం ఇదే. గత యేడాది కాలంగా కెమెరా ముందుకురాని అనుష్క ఓ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ చిత్రానికి 'ఎ ఫ్లాట్', 'ముంబై 125కేఎం', 'వస్తాడు నా రాజు' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నాడు.
 
ఈ చిత్రంలో ఓ ఎన్నారై బిజినెస్ వుమెన్‌‌గా అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. అంజలి, షాలినీ పాండే కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి 'సైలెన్స్' అనే పేరు ఖరారు చేశారు. మార్చి నెల చివరకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. కథ, తన పాత్ర నచ్చడంతోనే అనుష్క ఈ చిత్రం ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. 
 
సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుష్క కొత్త లుక్‌లో కనిపించనున్నారని, అందుకోసం చాలా కష్టపడ్డారని తెలుస్తోంది.