సంబంధిత వార్తలు
- పెళ్లయిన హీరోయిన్ ప్రేమలో ధనుష్.. భార్య నుంచి దూరమయ్యాక?
- జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారు .. హీరో బాలకృష్ణ
- మార్క్ ఆంటోని సినిమా చాలా మంది వద్దన్నా చేశా.. కారణం ఏమంటే.. . హీరో విశాల్
- పసుపు రంగు చీరలో బాగున్నానా.. రష్మిక మందన్న కొత్త నిర్ణయం?
- రామన్న యూత్ అభయ్ నా ఫేవరేట్ యంగ్ యాక్టర్ : హీరో సిద్ధార్థ్
చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా మారిన వేళ.. విశ్వ కార్తీకేయకు 20 ఏళ్లు..
Vishwa Karthikeya
చైల్డ్ ఆర్టిస్ట్గా గోరింటాకు, జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, లేత మనసులు, శివ శంకర్, అధినాయకుడు మొదలైన దాదాపు 50 చిత్రాలలో నటించి విజయం సాధించాడు. నంది అవార్డు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్, మెరిటోరియస్ అచీవ్మెంట్ కోసం స్టేట్ అవార్డ్ వంటి అనేక అవార్డులు.
జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి చిత్రాలలో కథానాయకుడిగా విశ్వ కార్తికేయ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆయుషి పటేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాని మూవీ వర్క్స్, రామ క్రియేషన్స్ ప్రొడక్షన్స్పై డాక్టర్ కె. చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కట్టం రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రమాకాంత్ రెడ్డి అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన కలియుగం పట్టణంలో టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. షూటింగ్ మొత్తం ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నారు. ఈ చిత్రానికి అజయ్ అరసాద సంగీతం అందిస్తుండగా, చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ, గ్యారీ బిహెచ్ ఎడిటర్, రవి ఆర్ట్ డైరెక్టర్. తెలుగు ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వ కార్తికేయను అభినందిద్దాం.
తర్వాతి కథనం
