1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Child Actor Turned Hero Vishva Karthikeya Completes 20 Years In TFI

చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా మారిన వేళ.. విశ్వ కార్తీకేయకు 20 ఏళ్లు..

Vishwa Karthikeya
Vishwa Karthikeya
చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, పలువురు అగ్ర తారలతో పనిచేసిన విశ్వ కార్తికేయ తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ మొదలైన వారితో విశ్వ పని చేశాడు. 
 
చైల్డ్ ఆర్టిస్ట్‌గా గోరింటాకు, జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, లేత మనసులు, శివ శంకర్, అధినాయకుడు మొదలైన దాదాపు 50 చిత్రాలలో నటించి విజయం సాధించాడు. నంది అవార్డు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్, మెరిటోరియస్ అచీవ్‌మెంట్ కోసం స్టేట్ అవార్డ్ వంటి అనేక అవార్డులు. 
 
జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి చిత్రాలలో కథానాయకుడిగా విశ్వ కార్తికేయ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆయుషి పటేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాని మూవీ వర్క్స్, రామ క్రియేషన్స్ ప్రొడక్షన్స్‌పై డాక్టర్ కె. చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కట్టం రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
రమాకాంత్ రెడ్డి అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన కలియుగం పట్టణంలో టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. షూటింగ్ మొత్తం ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నారు. ఈ చిత్రానికి అజయ్ అరసాద సంగీతం అందిస్తుండగా, చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ, గ్యారీ బిహెచ్ ఎడిటర్, రవి ఆర్ట్ డైరెక్టర్. తెలుగు ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వ కార్తికేయను అభినందిద్దాం.
తర్వాతి కథనం
వాయిదాపడిన ప్రభాస్ "సలార్" విడుదల