ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (12:12 IST)

ప్రముఖ సినీ నటులపై ఢిల్లీ పోలీసుల కేసు.. ఎందుకు?

'దిశ రేప్​' ఘటనకు సంబంధించి ప్రముఖ సినీనటులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచార బాధితురాలి పేరును సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసినందుకుగాను వారిపై ఈ కేసులు నమోదు చేశారు. 
 
గత 2019లో హైదరాబాద్​లో జరిగిన దిశ హత్యాచారానికి సంబంధించి.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ నటుడు రవితేజ, నటి రకుల్​ ప్రీత్ సింగ్​ సహా 38 మందిపై కేసు నమోదైంది. 
 
బాధితురాలి పేరును సామాజిక మాధ్యమాల వేదికగా బహిర్గతం చేసినందుకు ప్రముఖులను అరెస్టు చేయాలని కోరుతూ దిల్లీ తీస్ హజారీ కోర్టులో న్యాయవాది గౌరవ్ గులాటీ పిటిషన్​ దాఖలు చేశారు. 
 
అలాగే, సెక్షన్ 228ఏ కింద ప్రముఖులపై కేసు నమోదు చేయాలని సబ్జీ మండీ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు గౌరవ్. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్​గన్, అభిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ సహా టాలీవుడ్ నటులు రవితేజ, అల్లు శిరీష్, నటి ఛార్మి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు గౌరవ్. హర్బజన్ సింగ్, శిఖర్ ధావన్, సైనా నెహ్వాల్ పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.