శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (15:35 IST)

'అర్జున్ రెడ్డి' రీమేక్ షురూ.. హీరో తండ్రిగా స్టార్ డైరెక్టర్

"అర్జున్ రెడ్డి" సినిమా చూసి ఫిదా అయిన విక్రమ్ తన కొడుకు ధృవ్‌ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి ఈ సినిమాను ఎంచుకున్నాడు. కానీ ధృవ్ తొలి చిత్రం అనుకున్నప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. మొదటగా బాల దర్శకత్వంలో "వర్మ" టైటిల్‌తో ఈ రీమేక్ మొదలైంది. 
 
ట్రైలర్ విడుదల చేసి, సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసిన తర్వాత అవుట్‌పుట్ నచ్చకపోవడంతో అనూహ్యంగా డైరెక్టర్‌ను, హీరోయిన్‌ను తప్పించి మొత్తం మొదటి నుండి స్టార్ట్ చేసారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా 'ఆదిత్య వర్మ' అనే టైటిల్ పెట్టి షూటింగ్ స్టార్ట్ చేసారు. 
 
గిరిసాయి దర్శకత్వంలే తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి బనిత సంధుని హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోగా నటిస్తున్న ధృవ్‌కి తండ్రిగా ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటిస్తున్నారట. ఈ సినిమాలో 2020లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందం.