శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (18:13 IST)

గీతా ఆర్ట్స్ ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకు ఆందోళన చేసున్నారు తెలుసా..

Allu fants dharna
Allu fants dharna
పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్.  తగ్గేదెలే అంటూ ఎక్కడ తగ్గకుండా తన టాలెంట్ ను తెలుగు సినిమా సత్తాను ఖండాలు దాటించాడు. "పుష్ప" చిత్రానికి ప్రశంసలు, అవార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. పుష్ప ది రైజ్ SIIMAలో ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును గెలుచుకోవడంతో పాటు ఇటీవలే అల్లు అర్జున్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ బిరుదును కూడా అందుకున్నాడు.  
 
ఢిల్లీలో అల్లు అర్జున్‌ అవార్డును స్వీకరిస్తూ, “భారతీయ సినిమా, ఇండియా కభీ ఝుకేగా నహిం (భారతీయ సినిమా, భారతదేశం ఎప్పటికీ తగ్గేదేలే)” అని పుష్ప రాజ్ చెప్పిన డైలాగ్‌ను అల్లు అర్జున్ తనదైన శైలిలో మరోసారి చెప్పారు. కానీ ప్రస్తుతం అప్డేట్స్ ఇవ్వడంలో పుష్ప టీం తగ్గుతున్నారు అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏకంగా గీతా  ఆర్ట్స్ ఆఫీస్ ముందు ధర్నాకి దిగారు. 
 
"వి వాంట్ పుష్ప అప్డేట్"  అంటూ నినాదాలు మొదలుపెట్టారు, హైదరాబాద్ చుట్టూ ప్రక్కల నుంచి అభిమానులు తరలివచ్చి వెంటనే పుష్ప అప్డేట్ ఇవ్వాలని, లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాల్సి వస్తుందంటూ పెద్దఎత్తున ఫ్లెక్సీ లతో నినాదాలు చేసారు. పుష్ప రిలీజ్ అయ్యి సంవత్సరం కావస్తున్నా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు అంటున్న ఫ్యాన్స్ ఆందోళన  చెందుతున్నారు.
ఇంకొందరు అభిమానులు జై బన్నీ జై జై బన్నీ అనే నినాదాలను కూడా   చేసారు.అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారం పై పుష్ప టీం ఎలా స్పదిస్తుందో వేచి చూడలి.