గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (11:09 IST)

ఈవెంట్ మేనేజర్‌ ఫిర్యాదుతో చిక్కుల్లో పడిన హీరోయిన్.. సీసీబీ ఆరా!

కన్నడ చిత్ర పరిశ్రమలు డ్రగ్స్ వ్యవాహారం ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే శాండిల్‌వుడ్ నటి రాగిణి ద్వివేదిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. ఇపుడు మరో హీరోయిన్ సంజన గల్రానీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈవెంట్ మేనేజరు ప్రీతమ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈమె ఇంట్లో సీసీబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ మూలాలు వెలుగు చూశాయి. దీనిపై సీసీబీ పోలీసులు ఆరా తీయగా, కీలక సమాచారాన్ని రాబట్టారు. సీసీబీ అరెస్టు చేసిన డ్రగ్స్ ముఠా నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. ఇందులో ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. 
 
ఈ క్రమంలో న‌టి రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్ట్ చేయ‌గా, తాజాగా సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈవెంట్ మేనేజ‌ర్ ప్రీత‌మ్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగ‌ళూరులోని ఇందిరా న‌గ‌ర్‌లో ఉన్న సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. 
 
ఈ సోదాల‌లో కీల‌క ఆధారాలు ల‌భ్య‌మైతే సంజ‌న‌ని అరెస్టు చేయ‌డం ఖాయం అని అంటున్నారు. ఇంక ఈమె ద్వారా డ్ర‌గ్స్ ఉచ్చులో ఇంకెంత‌మంది చిక్కుకున్నార‌నే విష‌యాన్ని రాబ‌ట్ట‌నున్నారు. తాజాగా ఈ కేసులో డిజైనర్ నియాజ్‌ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.