బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (15:29 IST)

తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న "గద్దలకొండ గణేశ్".. కలెక్షన్ల వర్షం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం "గద్దలకొండ గణేష్" (వాల్మీకి). ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకువచ్చింది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించింది. 
 
ఈ చిత్రం విడుదైలన ప్రతిచోటా మంచి టాక్‌ను సొంతం చేసుకుని భారీ వసూళ్లు రాబడుతోంది. తొలి 3 రోజుల్లో ఈ సినిమా రూ.13.4 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. తొలి 3 రోజుల వసూళ్ల విషయంలో వరుణ్ తేజ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా గద్దలకొండ గణేష్ నిలించింది. 
 
గతంలో వరుణ్ తేజ్ నటించి సూపర్ హిట్ అయిన చిత్రాల్లో 'కంచి', 'ఫిదా', 'తొలిప్రేమ' వంటి చిత్రాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రాలు కలెక్షన్ల పరంగా తక్కువ. కానీ, గద్దలకొండ గణేష్ చిత్రం మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
వరుణ్ తేజ్ మాస్ లుక్‌తో అద్భుతమైన నటనకు పూజా హెగ్డే గ్లామర్, ఆకట్టుకునే వినోదం, పాటల కారణంగా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'సైరా' విడుదలయ్యే వరకూ 'గద్దలకొండ గణేశ్'కి పోటీగా నిలిచే సినిమాలేమీ లేకపోవడంతో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.