గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (15:16 IST)

సరోగసీ ద్వారా నయన-విక్కీ పారెంట్స్.. కస్తూరి ఫైర్.. ఎందుకు?

nayanatara_vignesh
కోలీవుడ్ స్టార్ హీరోయిన్, దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార, ఆమ భర్త దర్శకుడు విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. సరోగసి ద్వారా ఈ జంట తల్లిదండ్రులైనారు. 
 
అయితే సరోగసీ ద్వారా పిల్లలను కనబడటంపై సర్వత్రా విమర్శలు వున్నాయి. తాజాగా నటి కస్తూరి చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 
 
భారత్‌లో సరోగసి బ్యాన్. 2022 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప దీనిని ప్రోత్సహించకూడదని.. రానున్న రోజుల్లో దీని గురించి ఎక్కువగా వినబోతున్నామనంటూ ట్వీట్ చేసింది. దీనిపై నయనతార ఫ్యాన్స్ కస్తూరిపై ఫైర్ అవుతున్నారు. 
 
"మీ పని మీరు చూసుకోండని" కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. అర్హత గల న్యాయవాదిగా ఈ చట్టంపై విశ్లేషణ చేసే హక్కు తనకు వుందని.. తాను ఎవర్నీ ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టలేదని తెలిపారు.