శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 1 ఏప్రియల్ 2020 (18:47 IST)

అమెరికాలో భార్యాపిల్లలు, కన్నీళ్ళు పెట్టుకున్న మంచు విష్ణు

ఫిబ్రవరి నెలాఖరులో తమ బంధువుల్లో ఒకరికి సర్జరీ ఉండటంతో తన భార్యాపిల్లలతో కలిసి అమెరికాకు వెళ్ళారు మంచు విష్ణు. అయితే తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఉండటంతో తను ముందుగానే అమెరికా నుంచి తిరిగి రావడం జరిగిందని చెప్పారు మంచు విష్ణు. తన భార్య విరానికా, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్, ఐరాలు అమెరికాలో ఉన్నారు. వారిని బాగా మిస్ అవుతున్నా.
 
నాకున్న బ్యాడ్ హాబిట్ భార్యాపిల్లలతో బాగా కనెక్ట్ అవ్వడమే. అందుకే వారిని చాలా మిస్ అవుతున్నానని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంచు విష్ణు. చాలా కష్టంగా ఉందని.. తన లాగే చాలామంది బాధ అనుభవిస్తూ ఉండొచ్చన్నారు. కానీ లాక్ డౌన్ అనేది ప్రస్తుతం ఎంత అవసరమన్నది అందరికీ తెలిసిందేనని చెబుతూ మంచు విష్ణు కన్నీంటి పర్యంతమయ్యారు.
 
నన్ను చాలామంది ఎందుకు గడ్డం పెంచుతున్నావని పదేపదే అడిగారు. అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పే సమయం వచ్చింది. అందుకే చెబుతున్నా. నా పిల్లలను చూడకుండా నేను ఉండలేను. అలాంటిది వారు ఎక్కడో చాలా దూరంలో ఉన్నారు. వారిని గత నెల 13వ తేదీ అమెరికాలో వదిలిపెట్టి వచ్చానని బాధపడ్డారు మంచు విష్ణు.