1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (09:13 IST)

టాలీవుడ్ హీరో నాగశౌర్య విల్లాలో పేకాట.. 30 మంది పేకాటరాయుళ్ళ అరెస్టు

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన యువ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో విల్లా వుంది. ఇక్కడ కొంతకాలంగా జోరుగా పేకాట జరుగుతోంది. ఈ విషయం తెలిసిన పోలీసులు ఈ విల్లాపై దాడి చేశారు. ఆ సమయంలో పేకాటలో నిమగ్నమైవున్న 30 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల వద్దనున్న నాగశౌర్య విల్లాకు ఓ విల్లా వుంది. ఇక్కడ పేకాట జోరుగా సాగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో ఈ విల్లాపై దాడిచేసిన పోలీసులు పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. 
 
సుమన్ అనే వ్యక్తి బర్త్ డే ఫంక్షన్ కోసం ఈ విల్లాను అద్దెకు తీసుకుని దానిని పేకాట స్థావరంగా మార్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా 25 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.6.7 లక్షల నగదు, 33 సెల్‌ఫోన్లు, 24 కార్లు, 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఈ విల్లాను నాగశౌర్య అద్దెకు తీసుకున్నారు.
 
కాగా, ఫామ్‌హౌస్‌ను పేకాట స్థావరంగా మార్చిన విషయం నాగశౌర్యకు తెలుసా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంచితే, పోలీసుల రాకను గుర్తించిన కొందరు తప్పించుకునేందుకు మద్యం సీసాలను వారిపైకి విసిరినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.