శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (15:51 IST)

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా - శశివదనే

Sasivadane pooja
'పలాస 1978' సినిమాతో కథానాయకుడుగా వెలుగులోకి వ‌చ్చిన‌ రక్షిత్ అట్లూరి తాజాగా `శ‌శివ‌ద‌నే` సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌లుక‌రించ‌బోతున్నారు. కోమలీ ప్రసాద్ కథానాయిక. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. మంగళవారం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.  గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.
 
పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు మారుతి క్లాప్ ఇచ్చారు. సంగీత దర్శకులు రఘు కుంచె కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత శరత్ మరార్ తదితర ప్రముఖులు ఈ ముహూర్త కార్యక్రమానికి హాజరయ్యారు.
 
హీరో రక్షిత్ మాట్లాడుతూ, దర్శకుడు సాయి గారికి అద్భుతమైన విజన్ ఉంది. రెహమాన్ శిష్యుడు శరవణ వాసుదేవన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. కోమలీ, గ్యారీ.  మంచి టీమ్ కుదిరింది. మంచి సినిమా అవుతుంది. 'పలాస' తర్వాత 'నరకాసుర' అనే సినిమా చేస్తున్నాను. దాని తర్వాత ఇది మంచి ప్రేమకథ అవుతుంది. ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నానని తెలిపారు.
 
నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ, టైటిల్ సెప్టెంబర్ లో ప్ర‌కటించాం. మంచి స్పంద‌న వచ్చింది. రక్షిత్, కోమలి ప్రసాద్ పెయిర్ చాలా బావుంది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్లకు ఇదే తొలి సినిమా. డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నాం" అని చెప్పారు. 
 
కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ, క‌థ నేరేషన్  చేసిన ఐదు నిమిషాలకు ఓకే చెప్పేశా. నేరేట్ చేస్తుంటే సినిమా కనిపించింది. తేజ ప్రొడక్షన్ అని తెలిసినప్పుడు ఇంకా హ్యాపీ ఫీలయ్యా. వాళ్ల  ఆఫీసులో సినిమాలో సాంగ్స్ రఫ్ ట్రాక్స్ విన్నాను. చాలా హ్యాపీ" అని అన్నారు.  
 
ఎడిటర్  గ్యారీ మాట్లాడుతూ "ఇది మంచి కథ. విన్నప్పటి నుంచి నేనే చేస్తానని వెంట పడుతున్నాను. మంచి కథ, మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. తేజ నాకు మంచి ఫ్రెండ్" అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.      
 
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా... సీనియర్ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు ప్రిన్స్ దీపక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటర్: గ్యారీ బీహెచ్, కలరిస్ట్: ఎ. అరుణ్ కుమార్ (డెక్కన్ డ్రీమ్స్), సీఈవో: ఆశిష్ పెరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం: సాయికుమార్ దార, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం: శరవణ వాసుదేవన్, కాస్ట్యూమ్స్ - సమర్పణ: గౌరీ నాయుడు, నిర్మాత: అహితేజ బెల్లంకొండ, రచన - దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన.