ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: మంగళవారం, 8 డిశెంబరు 2020 (20:42 IST)

డిసెంబర్ 18న థియేటర్స్‌లో ఆర్జీవి కుటుంబ కథా చిత్రం మర్డర్

అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో నట్టి కరుణ, నట్టి క్రాంతిలు నిర్మిస్తున్న రాంగోపాల్ వర్మ కుటుంబ కథా చిత్రం మర్డర్. డిసెంబర్ 18న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.
 
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... కుటుంబ కథా చిత్రం మర్డర్, సెన్సార్ సభ్యుల నుండి యు/ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ నెల 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కాబోతోందని తెలిపారు.
 
నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ... న్యాయం గెలుస్తుందని మేము మొదటి నుండి చెబుతూ ఉన్నాము. మర్డర్ సినిమా విడుదలవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. చివరికి మాకు న్యాయం జరిగింది. డిసెంబర్ 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ఎవ్వరినీ ఉద్దేశించి తీసినది కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా ఈ మూవీ ఉండబోతోందని తెలిపారు.