గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 10 జులై 2019 (14:24 IST)

చిక్కుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి హీరోయిన్‌... ఈడీ నోటీసులు జారీ

టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం "ఘటోత్కచుడు". ఇందులో రీతుపర్ణ సేన్‌గుప్తా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఆమెకు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు నోటీసులు జారీచేశారు.
 
దీనికి కారణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న రోజ్‌ వ్యాలీ స్కామ్‌లో ఆమె పేరు రావడమే. ఇప్పటికే ఈ స్కామ్ ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రముఖ బెంగాలీ నటుడు ప్రసేన్జీత్ ఛటర్జీతో పాటు.. పలువురు నటీనటులు, ప్రముఖులకు ఈడీ తాఖీదులు పంపించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రీతుపర్ణసేన్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. విచారణకు రవాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.