సరిలేరు నీకెవ్వరు సెన్సార్ టాక్ ఏంటి..?

శుక్రవారం, 3 జనవరి 2020 (15:12 IST)
సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం సరిలేరు నీకెవ్వరు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. ఇప్ప‌టికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. 
 
ఈ సినిమాని చూసిన సెన్సార్ టీమ్ మెంబర్స్ చిత్ర యూనిట్‌ని ఎంతగానో అభినందించారట. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి ముందుగానే అభినందనలు తెలియచేసారట. 
 
జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైద‌రాబాద్ లాల్‌బహదూర్‌ స్టేడియంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్‌ ఈవెంట్`ను నిర్వహించి సంక్రాంతి కానుక‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌ చేయ‌నున్నారు.

అన్నీ చూడండి

cockraoch janata party, నా బొద్దింక జనతా పార్టీ హ్యాక్ అయ్యింది: అభిజిత్ దిప్కే

ఆత్మహత్యకు ముందు బ్యూటీ పార్లర్‌లో త్విషా శర్మ.. ఎవరైనా ఇలా చేస్తారా?

చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు - 82 మంది మృతి

సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య

టీవీఎల్ అనేది కొత్త రాజకీయ పార్టీనా..? రఘురామ కృష్ణం రాజు ఏమన్నారు?

అన్నీ చూడండి

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు

ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments