గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (16:20 IST)

సంక్రాంతికి పెద్ద పండగలాంటి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ -నిర్మాత

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నిర్మాత అనిల్‌ సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. 
 
సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా… నిర్మాత అనిల్‌ సుంకర మీడియా సమావేశం ఏరర్పాటు చేసారు.ఈ మీడియా మీట్ లో నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ... ”140 రోజులు ఎలాంటి అవాంతర పరిస్థితులు ఎదురవకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ స‌జావుగా పూర్తి అయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్‌కి సిద్ధమైంది. 
 
ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ గర్వపడేలా సినిమా వచ్చింది. ఆడియన్స్‌తో పాటు మేం కూడా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఎదురు చూస్తున్నాం. మహేష్‌బాబుగారిని ఫ్యాన్స్‌ ఎలా చూద్దాం అనుకుంటున్నారో అలా ఉంటుంది. యూత్‌, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో సినిమా అలా ఉంటుంది.
 
మహేష్‌బాబుగారి కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుంది. 
 
13 సంవత్సరాల తర్వాత విజయశాంతి గారు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. అవార్డు విన్నింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. మహేష్‌, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు ఎవరూ ఊహించనివిధంగా ఉంటాయి. అనీల్‌ రావిపూడి అనగానే ఎంటర్‌టైన్‌మెంట్‌ గుర్తుకొస్తుంది. 
 
అనుకున్నదానికంటే ఎక్కువ ఫన్‌ ఉంటుంది. ఫస్ట్‌డే ఏదైతే సంక్రాంతికి రిలీజ్‌ అనుకున్నామో ఆ దిశగా సంక్రాంతి విడుదలకు పూర్తి సన్నద్ధమైనందుకు సంతోషంగా ఉంది. ఓవర్సీస్‌లో బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. ఇక్కడ కూడా త్వరలో బుకింగ్స్‌ ఓపెన్‌ చేస్తాం. ఈ సంక్రాంతికి పెద్ద పండగలాంటి సినిమా. మా హీరో నుండి ఇంత వరకు ఇలాంటి ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చి ఉండదు అన్నారు.