1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (12:08 IST)

బోరున విలపించిన కామెడీ కింగ్... ఎందుకో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ కింగ్‌ ఎవరు అని అడిగితే ఠక్కున చెప్పే సమాధానం బ్రహ్మానందం. అలాగే, తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఒకరున్నారు. ఆయనే వడివేలు. తమ హాస్యంతో ప్రతి ఒక్కరినీ కడుపుబ్బ నవ్వించే ఈయన... ఇపుడు కన్నీటి పర్యంతమయ్యాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను ప్రజలను పాటించకపోవడమే. ఆయన కన్నీరు పెట్టుకున్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో వడివేలు కన్నీరు పెట్టుకున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితం కావాలనీ, సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. కానీ, ప్రజలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. యధేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. ఈ జనాల తీరును చూసి వడివేలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 
 
"నేను మ‌నోవేద‌న‌కి గుర‌వుతున్నా. ప్ర‌భుత్వాలు చెప్పింది విని కొద్ది రోజుల పాటు ఇంటి ప‌ట్టున ఉందాం. వైద్యులు, న‌ర్సులు ప్రాణాల‌ని ఫణంగా పెట్టి మ‌న‌ల్ని ర‌క్షిస్తున్నారు. ద‌యచేసి వారికి స‌హ‌క‌రిద్ధాం. పోలీసులు కూడా బ్ర‌తిమిలాడ‌టం చూస్తున్నా. ద‌య‌చేసి ఎవ‌రు బ‌య‌ట‌కి రాకండి. బిడ్డా పాప‌ల‌తో ఇంట్లోనే హాయిగా ఉందాం. ఎవ‌రు దీనిని తేలిక‌గా తీసుకోవ‌ద్దు" అంటూ వ‌డివేలు ప్ర‌జ‌ల‌కి బాధాత‌ప్త హృద‌యంతో విన్న‌వించారు.