శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (15:33 IST)

విలన్‌గా నటించనున్న "ఫిదా" హీరో

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్. హీరోగా ఈయన కెరీర్ సాఫీగా సాగిపోతోంది. అయితే, తొలిసారి ప్రతినాయకుని పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని హీరోగారే స్వయంగా బహిర్గతం చేయడం గమనార్హం. 
 
హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఓ రీమేక్ సినిమాలో తను విలన్ క్యారెక్టర్‌లో కనిపిస్తానని వెల్లడించారు. 2014లో వచ్చింది "జిగిర్తాండ" చిత్రంలో తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఇందులో సిద్దార్థ్ హీరోగా నటిస్తే, నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా బాబిసింహా నటించాడు. ఇప్పుడీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే వరుణ్ తేజ్ పోషించబోతున్నాడు. 
 
ప్రస్తుతానికైతే వరుణ్‌కు చిన్నపాటి నెరేషన్ ఇచ్చిన దర్శకుడు... త్వరలోనే పూర్తి స్క్రీన్ ప్లేతో రాబోతున్నాడు. అయితే వరుణ్ తేజ్ మాత్రం ఈ స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు కోరినట్టు సమాచారం. పూర్తిగా తమిళ్ ఫ్లేవర్‌తో ఉన్న ఈ సినిమాను నేటివిటీకి తగ్గట్టు మార్చాలని సూచించాడు. రీమేక్స్‌ను నేటివిటీకి, హీరో బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు ఎంత అద్భుతంగా మార్చగలడో "గబ్బర్ సింగ్" సినిమాతో హరీష్ శంకర్ నిరూపించుకున్నాడు కూడా.