శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: బుధవారం, 31 అక్టోబరు 2018 (19:44 IST)

'మ‌హాన‌టి'కి అరుదైన గౌర‌వం.. ఇండియ‌న్ ప‌నోర‌మాకి ఎంపిక‌

వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం `మ‌హాన‌టి.` సావిత్రి జీవిత క‌థ `మ‌హాన‌టి`గా తీర్చిదిద్దితే... తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వ‌సూళ్ల‌తో నీరాజ‌నాలు అందించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ ల‌భించాయి. ఇప్పుడు మ‌హాన‌టికి అరుదైన గౌర‌వం ద‌క్కింది.
 
ఇండియ‌న్ ప‌నోర‌మాలో తెలుగు చిత్ర‌సీమ నుంచి ప్ర‌దర్శ‌న కోసం `మ‌హాన‌టి` ఎంపికైంది. కీర్తి సురేష్‌, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ  ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రానికి నాగ అశ్విన్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.
 
 49వ‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ ఎఫ్ఐ) ఉత్స‌వాలు త్వ‌ర‌లో గోవాలో జ‌ర‌గ‌నున్నాయి. అందులో భాగంగా `మ‌హాన‌టి`ని ప్ర‌ద‌ర్శిస్తారు.
 
హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం, తుళు... ఇలా భార‌తీయ భాష‌ల నుంచి 22 చిత్రాలు ఈ చిత్రోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు నోచుకున్నాయి. తెలుగు నుంచి ఆ గౌర‌వం మ‌హాన‌టికి మాత్ర‌మే ద‌క్కింది.