సంబంధిత వార్తలు
- మహిళల ఆరోగ్యం: డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి హైదరాబాద్ స్టార్ట్-అప్లకు ఆహ్వానం
- భారత్ 6జి విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిన ప్రధాని మోడీ
- ఉత్పత్తి- సాంకేతిక ఆవిష్కరణలతో భారతీయ ద్విచక్ర ఈవీ మోటర్బైక్ మార్కెట్లో సమూల మార్పులను తీసుకురానున్న మ్యాటర్
- అన్లీష్ గ్లోబల్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా 2022లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్కి చెందిన సిఎంఆర్ యూనివర్సిటీ విద్యార్థి
- కుండపోత వర్షం.. బెంగళూరు కుదేలు.. జేసీపీ ట్రాన్స్పోర్ట్ (వీడియో)
ఆమ్లెట్ పౌడర్ను కనుగొన్న సివిల్ ఇంజినీర్.. నీళ్లలో కలిపి పాన్పై పోస్తే ఆమ్లెట్ రెడీ
ఆధునికత పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బిజీ బిజీగా వుంటూ త్వరగా వండుకునే వంటకాలపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఈ వార్త. అర్జున్ కేరళలోని కోజికోడ్కు చెందినవాడు. సివిల్ ఇంజనీర్, అతను ఆమ్లెట్లను తక్షణమే తయారు చేయడానికి ఆమ్లెట్ పౌడర్ను కనుగొన్నాడు.
ఆమ్లెట్ పౌడర్ను తయారు చేసే యంత్రాన్ని అతనే కనిపెట్టాడు. అతని ఆవిష్కరణను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. అర్జున్ ఆమ్లెట్ పౌడర్ తయారు చేసే కంపెనీని కూడా ప్రారంభించాడు. 5 రకాల ఆమ్లెట్ పౌడర్లు ఇందులో తయారు చేయబడ్డాయి.
ఆమ్లెట్ పొడిని నీళ్లలో కలిపి వేడి వేడి పాన్లో పోస్తే వెంటనే ఆమ్లెట్ తయారవుతుందని అర్జున్ చెప్పాడు. 2021లో, అతను రామనట్టుకర సమీపంలో ఈ కంపెనీని ప్రారంభించాడు, ఇప్పుడు 12 మంది ఉద్యోగులు ఉన్నారు. ఎలాంటి కృత్రిమ పదార్ధాలు లేకుండా ఈ ఆమ్లెట్ పౌడర్ను తయారు చేయడం జరిగింది. ఇది ఐదు రకాల్లో వస్తుంది. మసాలా ఆమ్లెట్, కిడ్స్ ఆమ్లెట్, ఎగ్ భుర్జీ, స్వీట్ ఆమ్లెట్, టచింగ్ ఆమ్లెట్.
