Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కపిలేశ్వర ఆలయంలో ఆడుకుంటున్న చిరుతపులులు (video)

Written By జె
Updated: బుధవారం, 19 మే 2021 (13:18 IST)
తిరుపతిలోని కపిలేశ్వర ఆలయంలో చిరుతపులుల సంచారం కలకలరేపుతోంది. రెండు చిరుత పులులు ఆలయంలో తిరుగుతూ కనిపించాయి. ఈ దృశ్యాలన్నీ మొత్తం సి.సి.టీవీలో రికార్డయ్యాయి. అయితే కరోనా కారణంగా ఆలయాన్ని మూసివేయడంతో నిర్మానుషంగా ఉన్న కారణంగా చిరుతలు వచ్చినట్లు టిటిడి సెక్యూరిటీ సిబ్బంది భావిస్తున్నారు.
 
కరోనా కారణంగా తిరుమలలో క్రమేపీ భక్తుల సంఖ్య తగ్గుతుంటే స్థానిక ఆలయాల్లో అయితే భక్తులే కనిపించడం లేదు. అందులోను స్థానిక ఆలయాలను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉండడంతో భక్తులు తక్కువ సంఖ్యలో దర్సనం చేసుకుంటున్నారు. 
 
ఆ తర్వాత భక్తులు లేకపోవడంతో ఆలయాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అందులోను టిటిడి ఆధ్వర్యంలో నడుపబడే తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం సరిగ్గా శేషాచలం అడవులకు సమీపంలో ఉంది. శేషాచలం అడవుల్లో చిరుత పులల సంచారం ఎప్పటి నుంచో ఉంది. నిర్మానుషంగా ఉండటంతో చిరుత పులులు ఇష్టానుసారం జనం తిరిగే ప్రాంతంలోకే వచ్చేస్తున్నాయి.
 
కపిలేశ్వర ఆలయంలో కూడా రాత్రి 7 గంటల సమయంలో రెండు చిరుతపులులు వచ్చినట్లు టిటిడి సెక్యూరిటీ సిబ్బంది సిసి కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడున్న టిటిడి సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేశారు. అయితే అప్పటికే చిరుతలు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. కానీ మొట్టమొదటి సారి ఆలయంలోకి చిరుతలు రావడం ఇదే ప్రధమమంటున్నారు టిటిడి అధికారులు. 

 

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments