శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 19 ఆగస్టు 2024 (22:02 IST)

ఆ మీడియా ప్రతినిధి రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: వేణు స్వామి ఆరోపణ (Video)

Venu Swamy
వివాదాస్పద జ్యోతిష్కుడుగా పేరుకెక్కిన వేణు స్వామి ప్రముఖ మీడియా ప్రతినిధి పైన సంచలన ఆరోపణలు చేసారు. తనను రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఓ ఆడియోతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పోస్టులో ఓ మహిళ అవతలి వ్యక్తితో వేణు స్వామి అంత ఇచ్చుకోలేరంటూ చెబుతున్నారు. అవతలి వ్యక్తి పేరు జూనియర్ జర్నలిస్ట్ అమర్ అని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా డబ్బు డిమాండుపై సాగింది. ఓ జ్యోతిష్యుడిని రూ. 5 కోట్లు డిమాండ్ చేయడం ఏంటనీ, తమను బ్లాక్ మెయిల్ చేస్తూ నిద్రలేని రాత్రులకు గురి చేస్తున్నారంటూ వేణు స్వామి దంపతులు ఆవేదన వ్యక్తం చేసారు.
 
ఈ వేధింపులు తాళలేక తాము గత కొన్నిరోజులుగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయామనీ, తాము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు కూడా ఆ వీడియోలో వారు తెలిపారు. ఈ వీడియోను చూసిన తర్వాత తమను లాయర్లు కాపాడుతారో, పోలీసులు కాపాడుతారో, జర్నలిస్టులు కాపాడుతారో తెలియదనీ, తమకు న్యాయం జరిగితే ఇంకా తమ వద్ద వున్న సాక్ష్యాలను బయటపెడతామంటూ చెప్పారు వేణుస్వామి సతీమణి. ఈ వీడియోలో చూడండి.