శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (13:14 IST)

ఫుడ్ ప్యాకెట్స్‌ని రుచి చూసిన జొమోటో డెలివరీ బాయ్.. నమ్రత ఫైర్

హోటల్స్‌, రెస్టారెంట్లలో నాణ్యత కలిగిన ఆహార పదార్థాలను సర్వ్ చేస్తున్నారో ఏమో. ఆ విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు బుక్ చేసేలా.. ఆహార పదార్థాలను బుక్ చేయడం ఫ్యాషనైపోయింది. ఆహార పదార్థాలను యాప్‌ల ద్వారా ఇంటికి తెచ్చుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇలా ఆహార పదార్థాలను డోర్ డెలివరీ చేసే సంస్థలు పెచ్చరిల్లిపోతున్నాయి. 
 
అలాంటి వాటిలో జొమాటో సంస్థ కూడా ఒకటి. కానీ జొమాటో డెలివెరీ బాయ్ ఒకరు కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్స్‌ని ఓపెన్ చేసి కొంచెం కొంచెం తిని.. తిరిగి ప్యాక్ చేసి డెలివరీ చేశాడు. ఇలా మూడు నాలుగు ఫుడ్ ప్యాకెట్లను రుచి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో రెండు రోజుల పాటు నెట్టింట చక్కర్లు కొట్టింది. దీన్ని చూసిన నెటిజన్లు సదరు ఫుడ్ డెలివరీ సంస్థపై విరుచుకుపడుతున్నారు. 
 
తాజాగా జొమాటో డెలివరీ బాయ్‌పై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి కూడా మండిపడింది. ఈ వీడియో చూసి తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయింది. అంతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేసి చెడామడా తిట్టేసింది. మంచి పేరున్న పుడ్ డెలివరీ సంస్థ పనితీరు ఇలా వుంటుందా అని షాక్ అయ్యింది.
 
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు కనీస శుభ్రతని ఆశిస్తారు. కానీ ఇలాంటి పనులా చేసేది.. వర్క్ ఎథిక్స్ అనేవి లేవా.. ఇదంతా చూస్తుంటే.. ఫుడ్ ఆర్డర్ చేయాలంటే, ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుందని.. ఇంకా తన పిల్లలను మాత్రం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయనివ్వను.. అందరూ ఇదే చేస్తే మంచిదని నమ్రత ఆగ్రహం వ్యక్తం చేసింది.