1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. PM Narendra Modi key statement on divestment in webinar

ఆ నాలుగు తప్ప అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తామన్న మోదీ, 'ఉక్కు' హుళక్కేనా?

Narendra Modi
ఇటీవలి కాలంలో పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రతిపాదనలను కేంద్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నో ఏళ్లుగా వారసత్వంగా వస్తున్నాయన్న ఒకే ఒక్క కారణంతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వం నడపలేదని తేల్చి చెప్పారు.
 
పీకల్లోతు నష్టాల్లో వున్న అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రజాధనంతో నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ సంస్థల ద్వారా ప్రభుత్వం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. అందువల్ల ప్రైవేటికరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీపమ్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అనే అంశంపై చేపట్టిన వెబినార్ లో ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు.
 
నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్నింటినీ ప్రైవేట్ పరం చేయనున్నట్లు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఆ ప్రకారం చూస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవడం ఖాయమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ప్రధాని చెప్పినట్లు నాలుగు వ్యూహాత్మక రంగాల్లో ఇది కూడా వుందా అనేది వేచి చూడాల్సిందే.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
మంగళవారం కోవిడ్ రెండో డోస్ టీకా తీసుకుంది, బుధవారం చనిపోయింది