సంబంధిత వార్తలు
- Jagan: అరెరె.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే.. లండన్కి జగన్ జంప్ అయ్యారే..
- ఎన్నికల్లో పోటీ చేసేది అధికారులు కాదు మంత్రులు... డ్రైవింగ్ ఫోర్స్లా పని చేయండి : సీఎం చంద్రబాబు
- Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్
- Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్ లోగ్ ఫస్ట్ లుక్
- ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్
ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025- దేశం నుంచి 100మందికి స్థానం.. ఆరుగురు తెలుగువారికి కూడా ప్లేస్
Forbes 2025 List
దేశంలోని మొత్తం బిలియనీర్ సంపద కొద్దిగా తగ్గినప్పటికీ, ఆరుగురు ప్రముఖ తెలుగువారు భారతదేశంలోని అత్యంత ధనవంతులలో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. దివిస్ లాబొరేటరీస్కు చెందిన మురళీ దివి రూ.88,800 కోట్ల నికర విలువతో తెలుగు వారిలో అగ్రస్థానంలో ఉన్నారు.
జాతీయ స్థాయిలో 25వ స్థానంలో ఉన్నారు. మేఘ ఇంజనీరింగ్ వ్యవస్థాపకులు పిపి రెడ్డి, పిపి కృష్ణారెడ్డి 70వ స్థానంలో ఉండగా, జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు 83వ స్థానంలో ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి 86వ స్థానంలో, హెటెరో గ్రూప్ చైర్మన్ బి. పార్థసారథి రెడ్డి 89వ స్థానంలో నిలిచారు.
అలాగే డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్కు చెందిన కె. సతీష్ రెడ్డి 91వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలోని తెలుగు బిలియనీర్లలో ఎక్కువ మంది ఫార్మా, మౌలిక సదుపాయాల రంగాల నుండి వచ్చారు.
