ట్రైయినర్‌ను పంజాలతో కొట్టి ఆడుకుంటూ చంపేసిన సర్కస్ పులులు

శనివారం, 6 జులై 2019 (15:11 IST)
నాలుగు పులులు వాటి ట్రైనర్‌ను తీవ్రంగా గాయపరచడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణ ఇటలీలోని ఓ సర్కస్ కంపెనీలో పులులకు శిక్షణ ఇచ్చే ఎటోర్ వెబర్(61) ఇటీవల ఆ పులులతో రిహార్సల్స్ చేయిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పులులు ఉన్న బోనులోకి వెళ్లిన వెబర్ వాటితో రిహార్సల్స్ చేయిస్తుండగా ఒక పులి ఆయనపై దూకి తీవ్రంగా గాయపరిచింది. మిగతా మూడు కూడా దానికి తోడయ్యాయి.
 
నాలుగు పులులూ కలిసి వెబర్‌ను పంజాలతో కొడుతూ బోనులో అటూఇటూ విసురుతూ ఆయన శరీరంతో ఆడుకున్నాయి. సర్కస్‌ కంపెనీలో పనిచేసే మిగతా సిబ్బంది, వైద్య సిబ్బంది వచ్చి రక్షించేటప్పటికే తీవ్రంగా గాయపడిన వెబర్ అనంతరం ప్రాణాలు కోల్పోయారు. ఓర్ఫీ సర్కస్‌లో పనిచేసే వెబర్‌కు ఇటలీలోని అత్యుత్తమ సర్కస్ శిక్షకుల్లో ఒకరిగా పేరుంది. యానిమల్ పార్క్ అనే షో కోసం ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆయన వాటికి శిక్షణ ఇస్తున్నారు.
 
కాగా, ఈ ఘటన తరువాత ఆ నాలుగు పులులను సర్కస్ కంపెనీ నుంచి జూకి తరలించారు. ఐరోపాలోని 20 దేశాలు సహా ప్రపంచంలోని సుమారు 40 దేశాల్లో సర్కస్‌లలో అడవి జంతులతో విన్యాసాలు చేయించడం, ప్రదర్శించడంపై నిషేధం ఉంది. కానీ, ఇటలీలో అలాంటి నిషేధం లేదు.

అన్నీ చూడండి

ఔత్సాహిక నటీనటులను ఆహ్వానిస్తున్న రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్

సుస్మితా సేన్ ఓ డైమండ్ డిగ్గర్.. కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని: లలిత్ మోదీ

విజయ్ తర్వాత ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? కస్తూరి రాజా ఏమంటున్నారు?

ఫ్లాట్ బెల్లీ కోసం అష్టకష్టాలు పడ్డాను.. చివరికి పొట్ట కింది కొవ్వు వుంటే మంచిది గ్రహించాను

Nikhil: వియత్నాంలో యుద్ధ విన్యాసాలు నేర్చుకుని స్వయంభూ తో సిద్ధంగా వున్న నిఖిల్

తర్వాతి కథనం
Show comments