కేసీఆర్ ప్రెస్‌మీట్: ‘నేనే దేవుణ్ని అన్న హిరణ్యకశిపుడు.. పొట్టుపొట్టు అయిండు’

Written By బిబిసి
Updated: శనివారం, 6 ఆగస్టు 2022 (18:23 IST)
‘‘ఏదైనా ముఖ్యమైన నిర్ణయం మీద నీతి ఆయోగ్‌లో చర్చ చేస్తున్నారా? ఇది కోఆపరేటివ్ ఫెడరలిజమా? లేదంటే ఇంపీరియల్ డిక్టేటరిజమా?’’ అని కేసీఆర్ కేంద్రం తీరును విమర్శించారు. ‘‘అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతాడు. డైరెక్ట్‌గా. మొత్తం భారతదేశంలో ఏకస్వామ్య పార్టీ ఉంటుంది, మిగతా వాటిని మింగేస్తాం, అని ఓపెన్‌గా చెప్తారు. ఇదేనా టీమ్ ఇండియా.?

 
ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తూ రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇవే రేపు మిమ్మల్ని కూడా కబళిస్తాయి కదా? చర్యకు ప్రతి చర్య ఉంటుంది కదా? ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తారా? ఇవన్నీ ఎవరి ప్రోత్సాహంతో జరుగుతున్నాయి? ఏం తమాషాగా ఉందా? ఇంత అహంకారమా? బెంగాల్‌లో, తెలంగాణలో, తమిళనాడులో ప్రకటిస్తారు.

 
ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా? ఏమైనా మాట్లాడితే జైల్లో వేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఇదేం పద్ధతి? టెంపరరీ ఫేజ్ కదా. హిరణ్యకశిపుడు కూడా నేనే దేవుణ్ని, నన్నే మొక్కాలి అన్నాడు. చివరికి ఏమైంది? పొట్టుపొట్టు అయిండు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments