పుదీనా రసాన్ని ముఖానికి రాసుకుంటే..?

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (10:58 IST)
చర్మం అందంగా ఉండాలని ఎవరు అనుకోరు.. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన పలురకాల సమస్యలను నయం చేసేందుకు పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చర్మ సమస్యల నుండి విముక్తి పొందాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. మరి అవేంటో ఓసారి తెలుసుకుందాం..
 
మొటిమలు తగ్గించేందుకు టమోటా గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే మొటిమలు తొలగిపోయి.. ముఖం మృదువుగా తయారవుతుంది.
 
స్పూన్ పసుపులో కొద్దిగా పాలు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని గంటపాటు అలానే ఉంచాలి. ఆపై వెచ్చని నీటితో కడుక్కోవాలి. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేలా చేస్తాయి.
 
పుదీనాలో ఉండే మెంథాల్ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. మొటిమలు తొలగించుకోవాలంటే.. తాజా పుదీనా రసాన్ని ప్రతిరోజూ రాత్రి సమయంలో ముఖానికి రాసుకోవాలి. పుదీనా ఆకుల్లో 2 స్పూన్ల పెరుగు వేసి గుజ్జులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసుకుని పావుగంట తరువాత కడిగేయాలి. ఇలా వారంలో కొన్నిసార్లు చేస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.    

అన్నీ చూడండి

ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదం, ఫార్చునర్ కారు డివైడర్‌ను ఢీకొని మరో కారుని ఢీకొట్టింది, ఇద్దరు మృతి

జూలై 19, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో 20 అడుగుల కొండచిలువ కలకలం, వీడియో

మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Vizag: 1.7 కిలోల బరువున్న శిశువుకు అరుదైన మెదడుకు శస్త్ర చికిత్స

అన్నీ చూడండి

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

Soori: సుహాస్, సూరి నటించిన మండాడి చిత్రాన్ని విడుదలచేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

తర్వాతి కథనం
Show comments