కాఫీ పొడిలో కొబ్బరి నూనె కలిపి..?

మంగళవారం, 29 జనవరి 2019 (17:27 IST)
ఈ కాలంలో చాలామందికి ముఖంపై మొటిమలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఈ మొటిమ సమస్యను తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. ఒక్కసారి లేదా రెండుసార్లు అవి బాగా పనిచేస్తాయి. మరి తరువాత సంగతేంటి.. ఎల్లప్పుడూ ఆ క్రీమ్స్ వాడలేం కదా. అందుకు ఇంట్లోని సహజసిద్ధమైన ఈ చిన్న పాటి చిట్కాలు పాటించి చూడండి... తప్పక ఫలితం ఉంటుంది.
 
రెండు బాదం పప్పులను తీసుకుని వాటిని సన్నని మంటపై కాల్చుకోవాలి. ఆపై ఓ చిన్న గిన్నె తీసుకుని అందులో కాల్చిన బాదం పప్పులు వేసి మెత్తని పొడిలా చేసుకుని అందులో స్పూన్ పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆపై ఈ మిశ్రమాన్ని మొటిమలున్న ప్రాంతాల్లో రాసుకుని అరగంట తరువాత నీటితో శుభ్రం కడుక్కోవాలి. ఇలా వారం పాటు క్రమంగా చేస్తే ముఖంపై గల మొటిమలు పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
అలానే కొందరికి చర్మమంతా జిడ్డు జిడ్డుగా పొడిబారినట్టు ఉంటుంది. అలాంటి చర్మాన్ని మృదువుగా చేయాలంటే.. కప్పు కాఫీ పొడిలో 2 స్పూన్ల కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు, కాళ్లకు రాసుకుని గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా తరచు చేస్తే చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.

అన్నీ చూడండి

జోహార్ ముద్రగడ అనే నినాదాలు మాని సీఎం జగన్ అంటారా?: ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ

దేశంలో అంధకారం నెలకొనవచ్చు : ప్రజలకు ఇరాన్ హెచ్చరిక

ముంబై లోకల్ ట్రైన్‌లో సీట్ల కోసం ఘర్షణ - ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే ప్రయోగం

తిరుమల గిరులు కిటకిట.. గోగర్భం డ్యామ్ వరకు భక్తుల బారులు

అక్రమ కట్టడాల కూల్చివేత కోసం బుల్డోజర్ల ప్రయోగం చట్టబద్ధమే...

అన్నీ చూడండి

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

Dixith Shetty :దీక్షిత్ శెట్టి, శశి ఓదెల చిత్రానికి #KJQ (కింగ్ జాకీ క్వీన్) పేరు ఖరారు

Fauji Poster Controversy: ఫౌజీ రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ కాలి వేళ్లపై అభిమానుల్లో రచ్చ ?

Samantha: చిత్తూరులో సమంతకు సీమంతం

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత శరత్‌చంద్ర నాయుడు

తర్వాతి కథనం
Show comments