పాల పౌడర్‌తో చర్మం మెరిసిపోతుంది.. ఎలా?

పాల పౌడర్‌తో చర్మం మెరిసిపోతుంది.. అంటున్నారు.. బ్యూటీషియన్లు. పాల పౌడర్లో నిమ్మరసం, తేనె చేర్చి పేస్టులా తయారయ్యాక.. ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్ల

శుక్రవారం, 15 డిశెంబరు 2017 (16:38 IST)
పాల పౌడర్‌తో చర్మం మెరిసిపోతుంది.. అంటున్నారు..  బ్యూటీషియన్లు. పాల పౌడర్లో నిమ్మరసం, తేనె చేర్చి పేస్టులా తయారయ్యాక.. ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మ ఛాయ పెంపొందుతుంది.  
 
అలాగే ఓట్స్‌ను ముందు రోజు రాత్రే నానబెట్టి మరుసటి రోజు ఉదయం పేస్టులా రుబ్బుకుని.. పుల్లటి పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మిల మిల మెరిసిపోతుంది. నిమ్మ తరహాలోనే బంగాళాదుంప బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాటోను పేస్టులా చేసుకుని.. దాన్ని రోజూ ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. 
 
ఇకపోతే.. తులసీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. తులసీలో యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వుండటంతో చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతుంది. మొటిమలను తొలగిస్తుంది. అందుకే తులసీ ఆకుల పేస్టును రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. కుంకుమపువ్వును పాలతో కలిపి పేస్టులా చేసి.. ముఖానికి రాసుకుని 30 నిమిషాల తర్వాత కడిగేస్తే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. చర్మ ఛాయ మెరుగుపడుతుంది. పసుపు, టమోటాను పేస్టులా చేసి.. ముఖానికి రాసుకుంటే మొటిమలు తొలగిపోతాయి. 
 
బాదం నూనెను వేడి చేసి.. ముఖానికి రాసుకుని మసాజ్ చేసి.. కాసేపు 15 నిమిషాల తర్వాత సబ్బుతో శుభ్రం చేసుకుంటే ముఖంలో రక్త ప్రసరణ మెరుగవడం ద్వారా చర్మం ప్రకాశిస్తుంది. సున్నిపిండి, మజ్జిగతో పేస్టులా చేసి.. ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 15 నిమిషాల పాటు వుంచి కడిగేస్తే.. చర్మం సౌందర్యం మెరుగుపడుతుంది. పుదీనా ఆకులను పేస్టులా రుబ్బుకుని.. ముఖానికి పట్టించి 10-15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. బనానా ఫేస్ ప్యాక్ ద్వారా చర్మ ఛాయను పెంపొందించుకోవచ్చు. 
 
అరటి గుజ్జుకు ఒక టీ స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనె చేర్చి ముఖానికి మాస్క్‌ల వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. జిడ్డు చర్మం కలిగిన వారు.. చందనాన్ని నీటిలో కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి పట్టిస్తే చర్మం తాజాగా మారుతుంది. రోజూ చందనం ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. చర్మంపై వున్న నల్లటి మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

అన్నీ చూడండి

Vizag: 1.7 కిలోల బరువున్న శిశువుకు అరుదైన మెదడుకు శస్త్ర చికిత్స

కార్గిల్ విజయ్ దివస్ 2026: జావా, యెజ్డీలపై రైడర్లతో శౌర్య విజయ్ యాత్రను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్

అలా నిరూపిస్తే కచ్చితంగా రాజకీయాలకు స్వస్తి పలుకుతాను.. కేటీఆర్

చంద్రాయణగుట్టలో లైసెన్స్ లేని మందులు

ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. 15 ఏళ్ల బాలికకు తొలిబిడ్డకు అనారోగ్యం.. మళ్లీ గర్భవతి

అన్నీ చూడండి

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

Soori: సుహాస్, సూరి నటించిన మండాడి చిత్రాన్ని విడుదలచేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

న్యూటన్స్ థర్డ్ లా' చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే థ్రిల్లర్ : సుమంత్

Priyanka Chopra: వారణాసి నుండి ప్రియాంక చోప్రా కొత్త లుక్ పోస్ట్ చేసిన రాజమౌళి

Sumanth: వారాహి అమ్మవారి చుట్టూ సాగే కథతో మహేంద్రగిరి వారాహి సిద్ధం

తర్వాతి కథనం
Show comments