కంటి కిందటి నల్లటి చారలు పోవాలంటే.. ఇలా చేయాలి..?

సోమవారం, 10 డిశెంబరు 2018 (14:37 IST)
పండగ హడావుడి.. ఇంటి అలంకరణ పనులతో, ఇంటికొచ్చిన అతిథులకు వండివార్చే పనిలో తీవ్రమైన అలసటతో ఉంటారు. కాబట్టి అప్పటికప్పుడు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు మళ్ళీ మీరు ఉత్సాహాన్ని పొందుతారు. ప్రతి రోజూ ముఖం శుభ్రంగా కడుక్కున్న తరువాత ఓ నాలుగు బొప్పాయి పండు ముక్కలతో ముఖంపై రుద్దితే నిర్జీవంగా ఉన్న చర్మం కాంతివంతంగా అవుతుంది.
 
అవిసెనూనెలో తగినంత నిమ్మరసం కలిపి జుట్టుకు రాసి మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా మారుతాయి. శిరోజాలకు నూనె రాసి అరగంటాగి.. అప్పుడు కండీషనర్ కలిసిన షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఇలా చేస్తే శిరోజాలు అందంగా మెరిసిపోతాయి. స్పూన్ ముల్తానీ మట్టి, స్పూన్ మీగడ, అరస్పూన్ తేనె, పావు స్పూన్ బాదం నూనెను పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చర్మం పొడిబారకుండా, కాంతివంతంగా తయారవుతుంది.
 
గులాబీ నీళ్లలో దూదిని నానబెట్టి కళ్ల కింద అప్పుడప్పుడూ తుడుస్తూ ఉంటే నల్లమచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. పలుచగా తరిగిన బంగాళాదుంప చక్రాలను కానీ, నిమ్మరసంలో ముంచిన కీరదోస ముక్కలని కానీ కళ్లపై ఉంచి 3 నిమిషాల తర్వాత తీసేసినట్లైతే కళ్లమంటలు తగ్గి మనసుకు హాయిగా ఉంటుంది. కళ్లలో అలసట ఛాయలు, నల్ల చారలు ఉన్ననట్లైతే కొద్దిగా కన్సీలర్ రాసి, ఆపై లేత వర్ణంలో ఉన్న పసిడి వర్ణపు ఐ షాడోను వేసుకొంటే కళ్లు చూడచక్కగా అందంగా కనిపిస్తుంది.

అన్నీ చూడండి

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments