నిమ్మరసంలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి...?

శుక్రవారం, 15 మార్చి 2019 (11:44 IST)
చాలామందికి ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాస్త కూడా తేడా కనిపించలేదు. ముఖ్యంగా ఈ మచ్చలు ముక్కు, నుదురు, చెంపలపై ఎక్కువగా వస్తుంటాయి. వాటిని రసాయనాలతో కంటే.. ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగించి తగ్గించుకోవడం మంచిది. 
 
రెండు స్పూన్ల్ నిమ్మరసంలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని అరగంట పాటు అలానే ఉండాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే ముఖంపై గల మచ్చలు పోతాయి. 
 
స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా తేనె, పాలు, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మచ్చలు తగ్గుముఖం పడుతాయి. 
 
టమోటా గుజ్జులో స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి మచ్చలున్న చోట రాసుకోవాలి. రాత్రంతా అలానే ఉంచి.. ఉదయాన్నే చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. తరచు ఇలా చేయడం వలన మచ్చల బాధ పోతుంది.
 
రెండు స్పూన్ల్ ఓట్స్ పొడికి తగినంత నిమ్మరసం, కొద్దిగా ఆలివ్ నూనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న ప్రాంతాల్లో రాసుకుని రెండు గంటలపాటు ఉంచి.. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తుంటే.. మచ్చలు పోతాయి. 

అన్నీ చూడండి

భర్త ICUలో వుంటే వెకిలిగా నవ్వుతూ రీల్స్ చేసిన భార్య, వీడియో వైరల్

ముద్రగడ అంత్యక్రియలు: గౌరవ వందనం చేస్తున్న పోలీసులను తోసేసిన అంబటి, వీడియో

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

అన్నీ చూడండి

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

Kiran Abbavaram: ఒడిదొడుకులు చూశా. ఇలాంటి మంచి సినిమాల కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నా: కిరణ్ అబ్బవరం

Thalapathy: ముగిసిన దళపతి విజయ్ జ‌న నాయ‌గ‌న్‌ నిరీక్ష‌ణ‌.. జూలై 23న గ్రాండ్ రిలీజ్

నాగవంశీ ఆవిష్కరించిన అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

తర్వాతి కథనం
Show comments