Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..?

వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..? ఈ చిట్కాలు పాటించండి. ఉసిరిపొడి, పెరుగు, తేనె సమపాళ్లు బౌల్‌లోకి తీసుకుని కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించి ఆరాక కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేయడ

Written By Selvi
Updated: శనివారం, 14 జులై 2018 (10:58 IST)
వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..? ఈ చిట్కాలు పాటించండి. ఉసిరిపొడి, పెరుగు, తేనె సమపాళ్లు బౌల్‌లోకి తీసుకుని కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించి ఆరాక కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేయడంవల్ల పెరుగుకీ ఉసిరికీ ఉన్న బ్లీచ్‌ గుణాల కారణంగా ముఖంమీద ఉన్న మొటిమల మచ్చలూ ట్యాన్‌ అన్నీ పోతాయి. 
 
అలాగే టేబుల్‌స్పూను బియ్యప్పిండిలో టీస్పూను గంధంపొడి, అరటేబుల్‌స్పూను పాలపొడి, టేబుల్‌స్పూను సెనగపిండి, టేబుల్‌స్పూను రోజ్‌వాటర్‌ కలిపి పేస్టులా చేసి మొహానికీ చేతులకీ పట్టించి పావుగంట తర్వాత కడిగేస్తే.. చర్మంమీది మృతకణాలన్నీ తొలగిపోయి, ముఖమూ చేతులూ మెరుస్తుంటాయి. 
 
ఇంకా తులసీ, వేపాకుల పేస్టుకు టీస్పూను పసుపూ అరటీస్పూను నిమ్మరసం కలిపి పట్టించి ఆరాక కడిగేస్తే ముఖంపై మచ్చలు మాయమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో జరిగిన అమెజాన్ వార్షిక సమావేశంలో మీర్జాపూర్ తారల సందడి

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. గర్భిణీ మహిళ ఆత్మహత్య

First baby girl in 200 years: 200 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ.. పండగ చేసుకున్నారు..

Sabarimala Gold Case: శబరిమలలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు బెయిల్

కొండా సురేఖ ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్

అన్నీ చూడండి

Hanuman Ansh: కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్‌ను వెనక్కి నెట్టిన హనుమాన్ అన్ష్

ఏవియేషన్ రంగం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న ప్రార్థనా చాబ్రియా

మహిళల భావోద్వేగాల అంశంతో హ్యాపీ జర్నీ చిత్రం విడుదలకు సిద్ధం

Allu Aravind: అల్లు అర‌వింద్ పై యశ్ మ‌ద‌ర్ విమర్శించడంలో పసలేదు

మణిశర్మ సంగీతం హైలైట్ గా గజ సినిమా విజయం ఖాయం : సాయి రాజేష్

తర్వాతి కథనం
Show comments