Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడిలో వున్నారా? గోరువెచ్చని నీటిలో రోజ్ వాటర్ కలిపి?

చర్మం కోమలంగా ఉంచుకోవాలంటే రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. చర్మం ఎక్కువగా పొడి బారినట్లు అనిపిస్తే మాయిశ్చరైజర్‌లో గులాబీ నీళ్లను కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుం

Written By selvi
Updated: గురువారం, 14 సెప్టెంబరు 2017 (10:23 IST)
చర్మం కోమలంగా ఉంచుకోవాలంటే రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. చర్మం ఎక్కువగా పొడి బారినట్లు అనిపిస్తే మాయిశ్చరైజర్‌లో గులాబీ నీళ్లను కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఎక్కువగా ఒత్తిడి గురైనట్లు అనిపిస్తే రాత్రి నిద్రించేందుకు ముందు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల గులాబీ నీళ్లను కలిపి స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది. చర్మం కమిలినట్లు అనిపిస్తే గులాబీ నీళ్లలో కాటన్‌ను ముంచి ఆ ప్రాంతంలో ఉంచితే చర్మం మృదువుగా మారుతుంది. 
 
ముఖానికి ఏదైనా మాస్క్ వేసుకుని దానిని తొలగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సహజసిద్ధంగా మాస్క్‌ని తొలగించుకోవాలంటే గులాబీ నీటిని వాడవచ్చు. ఒక గ్లాసులో గులాబీ వాటర్‌ను తీసుకుని అందులో కాటన్ ముంచి ముఖంపై ఉన్న మాస్క్‌ను నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డీ హైడ్రేట్ కాకుండా ఉంటుందని బ్యూటీషియన్లు అంటున్నారు. 

అన్నీ చూడండి

August 28, 2026: శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

బాలికను వివస్త్రను చేసి పూజలు చేస్తే కోటీశ్వరులవుతారు: దొంగ బాబాల అఘాయిత్యం

భారీగా పడిపోయిన చికెన్ ధరలు, కారణం ఇదే

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పీఠం ఎవరిది? ప్రధాని ఎవరు? సర్వే షాకింగ్ రిజల్ట్స్

గర్భిణీగా వున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై ఇనుప రాడ్‌తో దాడి.. ఎక్కడ?

అన్నీ చూడండి

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Nani: ఫోక్ మాస్ ఆంథమ్‌గా ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ డల్లాస్‌లో లాంచ్

Vishwak Sen : పొలిటికల్ యాక్షన్ డ్రామాగా విశ్వక్ సేన్ LEGACY రాబోతోంది

స్కూల్ కు వెళ్లేప్పుడు చేసే సందడంతా సమ్మర్ హాలిడేస్ పాట

తర్వాతి కథనం
Show comments