వేసవి ఎండలు ముదురుతున్నాయి... చర్మ సౌందర్యానికి చిట్కాలు...

ఎండలు బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలో సంభవించేటటువంటి మార్పులు ఎన్నో రకాల అనారోగ్యాలకు దారితీస్తాయి. ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గుల వల్ల ఆహారం తీసుకునే పద్ధతిలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఎండలో బాగా తిరిగే

సోమవారం, 9 ఏప్రియల్ 2018 (21:40 IST)
ఎండలు బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలో సంభవించేటటువంటి మార్పులు ఎన్నో రకాల అనారోగ్యాలకు దారితీస్తాయి. ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గుల వల్ల ఆహారం తీసుకునే పద్ధతిలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఎండలో బాగా తిరిగే వారికి చర్మానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు కొన్ని చిట్కాల ద్వారా నివారించవచ్చు.
 
1. ఎండ ప్రభావం ముఖంపై ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ సమస్యను తొలగించుకోవాలంటే.... పచ్చిపాలలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. 
 
2. ఈ ఎండకాలంలో కొంత మంది ముఖంపై జిడ్డు ఎక్కువగా పేరుకుంటుంది. అలాంటి వారు ఒక టీ స్పూన్ నిమ్మరసంలో ఒక టీ స్పూన్ టమోటా రసాన్ని కలిపితే చక్కటి మాయిశ్చరైజర్ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. నిమ్మరసంలో మరియు టమోటా రసంలో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చి జిడ్డును తొలగిస్తాయి. 
 
3. ఎండలో ఎక్కువగా తిరిగే వారు రాత్రి పడుకునే ముందు కలబంద గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకొని పడుకోవాలి. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించటంతో పాటు మెరిసే చర్మాన్ని అందిస్తుంది. ఇలా క్రమంతప్పకుండా పది రోజులు చేయడం వల్ల ముఖం మృదువుగా, అందంగా మారుతుంది.
 
4. పాలలో కొద్దిగా శెనగపిండి, చిటికెడు పసుపు కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇది చర్మంలో ఉన్న మురికిని తొలగించి ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.

అన్నీ చూడండి

భార్యను గొడ్డలితో నరికేసి ఠాణాకు వెళ్లి లొంగిపోయిన వృద్ధుడు

లైంగిక వేధింపులు - భారత సంతతికి చెందిన 13 యేళ్ల జైలు

స్టాలిన్ ఓడిపోవడం బాధ కలిగించింది.. చౌకబారు వ్యక్తిని కాదు : రజనీకాంత్

ప్రాణాంతక ఎబోలా వైరస్ - హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ

భార్య ప్రైవేట్ భాగంలో ఇనుపరాడ్డు చొప్పించి హత్య.. ప్రమాదంలో చనిపోయిందని నమ్మించిన భర్త...

అన్నీ చూడండి

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

తర్వాతి కథనం
Show comments