Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ రెండుపూటలా స్నానం చేస్తే సరిపోదు... మరింకేం చేయాలి?

Written By సిహెచ్
Updated: బుధవారం, 21 నవంబరు 2018 (21:03 IST)
ప్రతిరోజు రెండు పూటలా స్నానం, ముఖానికి సబ్బు, చర్మం కాంతివంతంగా ఉండడానికి ఓ మాయిశ్చరైజర్... ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలనుకుంటారు చాలామంది మహిళలు. అయితే వీటితో పాటు చర్మ సంరక్షణలో భాగంగా ముఖ్యమైనది మృత కణాలను తొలగించుకోవడం. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే చర్మం నిర్జీవంగా మారి కళ తప్పి పొడిబారినట్లవుతుంది. మరి వీటిని సహజమైన పదార్దాలను ఉపయోగించి ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. వేపాకుల్ని ముద్దలాగా చేసి కాస్త పెసరపిండి , చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి.  ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం నునుపుగా తయారవుతుంది.
 
2. ఒక చెంచా కొబ్బరి నూనె, ఒక చెంచా ఆలివ్ నూనె బాగా కలిపి ఇందులో మూడు చెంచాల చక్కెర కలిపి ముఖానికి మిగతా శరీరానికి రాసి కొన్ని నిముషాల పాటు మృదువుగా మర్దనా చేయాలి. పది నిముషాలు ఆగి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చక్కెర చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది.
 
3. కొబ్బరినూనె  చర్మానికి కావలసిన తేమను, పోషణను అందిస్తుంది.
 
4. ఒక టీ స్పూన్ టమోటా రసంలో కొద్దిగా గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ బ్రూ పొడిని కలిపి ఫేస్టులా చేసి దానిని ముఖానికి పట్టించాలి. 15 నిమిషముల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇలా వారంలో రెండు రోజులు చేయడం వలన ముఖం పై ఉన్న ముడతలు తొలగిపోయి యవ్వనంగా కనిపిస్తారు. 
 
5. అరటిపండు ఆరోగ్యానికే కాకుండా మంచి సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. అరటిపండులో మాయిశ్చర్ అధికం. అరటిపండులో పొటాషియం, విటమిన్ సి, ఇ ఎక్కువుగా ఉంటాయి. అరటిపండుగుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి గంట తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. దీని వలన ముఖంపై ఉన్న నల్లమచ్చలు తొలగి చర్మం సున్నితంగా తయారవుతుంది.

అన్నీ చూడండి

మెడికో ప్రియాంక కేసు.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు : హోం మంత్రి అనిత

వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో కీలక పరిణామం : సెక్షన్లు మార్చనున్న పోలీసులు

జెన్ జీ మన పిల్లలే ... పిల్లల భవిష్యత్ కంటే మంత్రి పదవి ముఖ్యం కాదు : ధర్మేంద్ర ప్రధాన్

జగన్ శిష్యులం... ఆయన కోసం ఎంతకైనా తెగిస్తాం : వైకాపా నేత చింతాడ

సెలవు అడిగితే ఉద్యోగం నుంచి తీసేశారు.. మనస్తాపంతో బలవన్మరణం

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments