శనగపిండిలో పాలు కలిపి ముఖానికి రాసుకుంటే?

శనగపిండిలో పాలు కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో మెల్లగా రుద్దుతూ కడిగితే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆలివ్ నూనెను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగితే మీ ముఖం అందంగా మృదు

శుక్రవారం, 1 జూన్ 2018 (11:40 IST)
శనగపిండిలో పాలు కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో మెల్లగా రుద్దుతూ కడిగితే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆలివ్ నూనెను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగితే మీ ముఖం అందంగా మృదువుగా కనిపిస్తుంది. అరటిపండు గుజ్జులో పెరుగు, సెనగపిండి, గుడ్డులోని తెల్లని సొన ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని బాగా కలిపి ముఖానికి రాసి, అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం మెరుస్తుంది.
 
బొప్పాయి గుజ్జులో కీరదోస రసాన్ని కలిపి అందులో తేనె, గంధపుపొడి, ముల్తాని మట్టి ఒక్కొక్క స్పూన్ వేసి దానిలో కొంచెం పాలు కలిపి పేస్టుగా తయారుచేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత నీటిలో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖంలోని మచ్చలు తొలగిపోతాయి. 
 
రెండు స్పూన్ల బియ్యపు పిండిలో అరస్పూన్ తేనె, కొంచెం చల్లని టీ డికాషన్ కలిపి బాగా కలుపుకుని ముఖానికి రాసి 20 నిమిషాల తరువాత కడిగివేస్తే ముఖం మెరిసిపోతుంది. బంగాళాదుంపను మెత్తని గుజ్జుగా చేసుకుని ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి కడిగేస్తే నల్లటి మచ్చలు తొలగిపోవుటకు తయారపడుతుంది. 
 
నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానిక పట్టించి అరగండ తరువాత కడిగేస్తే ముఖం మృదువుగా ఉంటుంది. కొబ్బరిపాలను దూదిలో ముంచుకుని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. దోసకాయ రసంలో కొంచెం నిమ్మరసం, రోజ్‌వాటర్ కలుపుకుని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడుక్కుంటే మంచిది.
 
బార్లీ గింజలు, గసగసాలు పేస్టుగా తయారుచేసుకుని అందులో కొంచెం నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో కడిగితే ముఖం అందంగా మెరిసిపోతుంది. 

అన్నీ చూడండి

Woman: ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర-20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యం.. నారా లోకేష్

NEET UG-2026: నీట్‌ను రద్దు చేయాలి... తమిళనాడు సీఎం విజయ్

భార్యపై అనుమానం.. గొడ్డలితో భార్య కాలిని నరికిన భర్త...

హిందూ మతం అనేది ఒక జీవన విధానం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments