ఏపీలో గ్రూపు-4 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి - 11,574 మంది అర్హత

గురువారం, 13 అక్టోబరు 2022 (13:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూపు-4 ఫిలిమ్స్ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 11,574 మంది అర్హత సాధించారు. మొత్తం 2,11,341 మంది ఈ పరీక్షకు హాజరైనట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
రాష్ట్ర రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్సెంట్ పోస్టుల భర్తీ కోసం గ్రూపు-4 ప్రిలిమ్స్ ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. గత జూలై 31వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. 
 
ఇందులో మొత్తం 2,11,341 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, మెయిన్ పరీక్షకు 11574 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు తెలిపింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. 

అన్నీ చూడండి

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments