ఏపీలో గ్రూపు-4 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి - 11,574 మంది అర్హత

గురువారం, 13 అక్టోబరు 2022 (13:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూపు-4 ఫిలిమ్స్ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 11,574 మంది అర్హత సాధించారు. మొత్తం 2,11,341 మంది ఈ పరీక్షకు హాజరైనట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
రాష్ట్ర రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్సెంట్ పోస్టుల భర్తీ కోసం గ్రూపు-4 ప్రిలిమ్స్ ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. గత జూలై 31వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. 
 
ఇందులో మొత్తం 2,11,341 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, మెయిన్ పరీక్షకు 11574 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు తెలిపింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. 

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments